అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్ము అయోధ్య ఎయిర్ పోర్ట్కు చేరుకున్నారు. ఆమెకు యూపీ గవర్నర్ అనందిబెన్ పటేల్, రాష్ట్ర మంత్రి సూర్య ప్రతాప్ షాహి స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అయోధ్యలోని హనుమాన్ ఘారీ దేవాలయానికి వెళ్లి హనుమంతుని దర్శించుకున్నారు.