సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమపై కేసు నమోదు

సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ అద్దాల పరిశ్రమలో నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో 5 మంది వలస కార్మికులు మృతి చెందిన సంగతి విధితమే. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పొలీస్ స్టేషన్లో పరిశ్రమ నిర్లక్ష్యంపై శనివారం కేసు నమోదు చేశారు. ఫరూక్ నగర్ మండల డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసినట్టు షాద్ నగర్ ఏసిపి ఎన్. సి రంగస్వామి తెలిపారు.

సంబంధిత పోస్ట్