వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగియగా, తీర్పును న్యాయస్థానం రిజర్వు చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను బెయిల్ పిటిషన్పై తీర్పు వచ్చే వరకు పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.