ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం తెలంగాణకు వచ్చిన మోదీ ఈ ప్రాంతానికి ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడలేదని మండిపడ్డారు. రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని బీజేపీ ఎలా మార్చాలనుకుంటుందో అని రుజువులతో సాయంత్రం 5 గంటలకు బయటపెడతానని తెలిపారు. అప్పుడు జనాలు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాలని సూచించారు.