వర్షంలో తడుస్తూ రీల్స్ చేస్తున్న ఓ యువతికి వరుణుడు షాక్ ఇచ్చాడు. బిహార్లోని పలు ప్రాంతాల్లో చాలారోజుల తర్వాత బుధవారం వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఈ క్రమంలో సిర్సియా గ్రామానికి చెందిన సానియా కుమారి అనే యువతీ వర్షంలోకి వెళ్ళి రీల్స్ చేయసాగింది. అయితే ఉన్నట్టుండి సమీప ఇంటిపై భారీ శబ్దంతోపాటు మెరుపులతో పిడుగులు పడ్డాయి. దాంతో భయాందోళనకు గురైన ఆమె అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.