జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో అంబులెన్స్లో నిలువ ఉంచిన గంజాయిని ఎత్తుకెళ్లిన ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు జగిత్యాల డిఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. కాగా ఈ సంఘటనలో బాధ్యులను చేస్తూ ఇద్దరు ఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ను అధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు.