రైస్ మిల్ యజమానిపై చర్యలు తీసుకోవాలి

మంథనిలోని సత్యసాయి రైస్ మిల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు గొర్రె రమేష్ మంథని ఆర్డీవో హనుమనాయక్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం మంథని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ప్రజా సంఘాల నాయకులు కలిసి ఇటీవల గొర్రెల మృతికి కారణమైన రైస్ మిల్ యజమానిపై తక్షణమే చర్యలు తీసుకొని ప్రభుత్వం నుండి పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాగర్, వేల్పుల సురేష్, బావు రవి, కిష్టస్వామి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్