ఓ వ్యక్తి ఫ్లిప్కార్ట్లో చేసిన ఆర్డర్ను ఆరేళ్లయినా కంపెనీ డెలివరీ చేయలేదు. ముంబయికి చెందిన అహ్సన్ ఖర్బాయ్ 2018 మే 16న ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో రూ.485 చెప్పులను ఆర్డర్ చేశాడు. ఆరేళ్లయినా కంపెనీ ఆ ఆర్డర్ను డెలివరీ చేయలేదు కానీ.. ఇన్నాళ్లకు ఇటీవల యూజర్కు ఫోన్ చేసి ‘సమస్య ఏంటీ’ అని అడిగారట. తనకు ఎదురైన ఈ వింత అనుభవాన్ని ఆ కస్టమర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.