పాకిస్థాన్లో కొందరు యువకులు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. రైల్వే ట్రాక్ ఆనుకుని ఒక చెరువు ఉంది. అందులో బైక్ స్టాండ్ వేసి స్టార్ట్ చేశారు. చక్రం స్పీడ్గా తిప్పుతూ.. రైలు ప్రయాణికులపై నీళ్లు పడేలా చేశారు. దీంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు.. యువకుల భరతం పట్టారు. బైకు ట్రైన్లో వేసుకుని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.