నీట్ స్కామ్పై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష ఇండియా కూటమి కసరత్తు సాగిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై గురువారం జరిగిన ఇండియా కూటమి భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. నీట్ అంశంపై రేపు తాము సభలో నోటీసులు ఇస్తామని డీఎంకే ఎంపీ టీ.శివ వెల్లడించారు.