దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. సెన్సెక్స్ 793 పాయింట్ల నష్టంతో 74,244 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 234 పాయింట్లు కోల్పోయి.. 22,519 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో వేదాంత, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఐఆర్సీటీసీ, సీజీ కన్జ్యూమర్ లాభాలను చూశాయి. లారస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ నష్టాలను మూటగట్టుకున్నాయి.