టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆఫ్గనిస్తాన్తో మ్యాచ్లో భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఈ అవార్డు అందుకోవడం అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో సూర్యకు ఇది 15వ సారి. ఇలా 15 సార్లు అంతర్జాతీయ టీ-20 ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు ఇప్పటివరకు కోహ్లీ మాత్రమే అందుకున్నాడు. తాజాగా ఆ రికార్డును సూర్య సమం చేశాడు.