టీమ్ఇండియా సీనియర్లు కెప్టెన్ రోహిత్శర్మ, విరాట్ కోహ్లీ దాదాపు ఏడాదిపాటు అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్లో మూడు మ్యాచ్ల సిరీస్కు జట్టులో చేరారు. టోర్నీలో రోహిత్ శతకంతో అదరగొట్టగా, కోహ్లీ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. రోహిత్ సారథ్యంలోనే టీమ్ఇండియా ప్రపంచకప్లో తలపడుతుందని చెప్పిన జై షా కోహ్లీ గురించి స్పష్టత ఇవ్వలేదు. దీంతో టీ20 ప్రపంచకప్లో విరాట్ స్థానంపై సందిగ్ధం నెలకొంది.