టెంపోను ఢీకొట్టిన ట్యాంకర్.. 8 మంది మృతి

యూపీలోని ప్రతాప్‌గఢ్‌ పరిధి లీలాపూర్‌లో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్‌లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టింది. టెంపోలో ప్రయాణిస్తున్న 8 మంది చనిపోయారు. ట్యాంకర్ నుంచి గ్యాస్ భారీగా లీక్ అయింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్