టెట్ అర్హత లేనివారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందని పిటిషనర్ల తరపున న్యాయవాది వాదించారు. అయితే అభ్యర్థులు 1995-2008 మధ్య ఎస్జీటీలుగా నియమితులయ్యారని ప్రతివాదుల తరఫున న్యాయవాది వాదించారు. కానీ ఎస్సీటీఈ నోటిఫికేషన్ 2010లో వచ్చిందని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెట్ అర్హత తప్పనిసరన్నారు. అందువల్ల నోటిఫికేషన్కు ముందు నియమితులైనవారికి టెట్ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో 36 జారీ చేసిందన్నారు.