పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల ఆందోళనలు తీవ్రమైన వేళ పాకిస్థాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పీఓకేకు రూ.2,300 కోట్ల రాయితీ నిధులను విడుదల చేస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోమవారం ప్రకటించారు. 40 కిలోల గోధుమపిండి బస్తా ధరను 1100 రూపాయలు(పాక్ కరెన్సీ) తగ్గిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు కూడా ఆమోదం తెలిపారు.