దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు పురోగమించాయని.. ఈ నెల 19న అండమాన్ నికోబార్ దీవులు, పరిసర ప్రాంతాలను తాకే అవకాశం ఉందని ప్రకటించింది. జూన్ ఒకటో తేదీ నాటికి సాధారణంగా కేరళను తాకే అవకాశాలున్నాయని చెప్పింది. జులై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాలున్నాయని చెప్పింది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.