మహారాష్ట్ర బారామతి విమానాశ్రయం సమీపంలో మే 10న దారుణం జరిగింది. 21 ఏళ్ల మహిళ, భర్తతో కారులో ఉండగా ఇద్దరు దొంగలు వచ్చారు. కత్తితో బెదిరించి వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బలవంతంగా వారి దుస్తులు తొలగించి, ఫొటోలు తీశారు. అనంతరం దంపతుల వద్దనున్న బంగారం దోచుకున్నారు. చోరీ గురించి బహిర్గతం చేస్తే ఫొటోలు ఆన్లైన్లో పెడతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.