తుఫానుగా మారనున్న వాయుగుండం.. తీరం దాటే అవకాశం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి శుక్రవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది బంగ్లాదేశ్‌లోని ఖేర్పురకు దక్షిణ నైరుతీదిశగా 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈశాన్యం దిశగా కదులుతూ శనివారం నాటికి తుఫాన్‌గా బలపడనున్నదని వాతావరణశాఖ పేర్కొంది. ఆదివారం బెంగాల్‌, బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటే అవకాశమున్నదని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్