గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రాయడానికి 1:100 చొప్పున అవకాశం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. గతంలో అశోక్నగర్కు వెళ్లి కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టి, తాము అధికారంలోకి వచ్చాక గ్రూప్-1 మెయిన్స్లో 1:100 చొప్పున అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.