‘అబ్ కీ బార్ 400 పార్’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ.. ‘తీన్ సౌ’ అనగా 300 సీట్ల లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోయింది. ఎన్డీయే కూటమి పార్టీలన్ని కలిసినా 300 మార్కు దాటలేదు. 400 సీట్ల బీజేపీ లక్ష్యాన్ని తీవ్రంగా దెబ్బ కొట్టిన రాష్ట్రాలు ప్రధానంగా మూడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్. అలాగే.. పంజాబ్, రాజస్థాన్లలో కూడా బీజేపీ ఆశించినన్ని సీట్లు రాలేదు.