తాజాగా ఢిల్లీ నుంచి టోరంటో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఎయిర్ కెనడాకు చెందిన విమానం మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టరంటోకు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా.. బెదిరింపు బూటకమని తేలింది.