ఒడిశా సీఎం, బిజూ జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. మంగళవారం విడుదలైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజూ జనతాదళ్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం భువనేశ్వర్లోని రాజ్భవన్కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రఘుబర్ దాస్కు సమర్పించారు.