రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణంతో కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని ఆయన స్వగ్రామం పెదపారుపూడిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణ వార్త విని గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామ కూడళ్లలో ‘జోహార్ రామోజీరావు’ అంటూ నినాదాలు చేశారు. రామోజీ ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్థులు ఆయనకు నివాళులర్పించేందుకు హైదరాబాద్ బయలుదేరారు.