ఢిల్లీలోని కీర్తినగర్ హైవేలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీర్తి నగర్లోని ఓ సందులోనుండి రోడ్డుపైకి వస్తున్న కారును అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 26 ఏళ్ల యువకుడి మెడ తెగిపడగా.. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.