బ్యాంకుల వద్ద 2024 మార్చి చివరకు క్లెయిమ్ చేయని (అన్క్లెయిమ్డ్)డిపాజిట్లు 26% పెరిగి రూ.78,213 కోట్లకు చేరాయని ఆర్బీఐ వార్షిక నివేదికలో తెలిపింది. 2023 మార్చి ఆఖరుకు ఈ మొత్తం రూ.62,225 కోట్లుగా ఉంది. పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచి క్లెయిల్ చేయని డిపాజిట్లను ఆర్బీఐకు చెందిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (డీఈఏ)కు బ్యాంకులు బదిలీ చేస్తుంటాయి.