ఇంకా పలు చోట్ల ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. హవేరీ ప్రాంతవాసులు.. వర్షాలు పడాలని తమ పూర్వీకుల సమాధులను తవ్వుతున్నారు. చర్మవ్యాధులతో చనిపోయినవారి సమాధులను బయటికి తీసి దాన్ని వరుణుడికి చూపిస్తే శాంతించి వర్షాలు కురిసేలా చేస్తాడని వారి నమ్మకం. రుతుపవనాలు ఒక్కసారిగా కనుమరుగవటంతో గత రెండు వారాలుగా సమాధులను తవ్వి మళ్లీ కుటుంబసభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.