అన్ని అస్త్రాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన టీమ్ఇండియా.. వాటిని పరీక్షించుకొనేందుకు శనివారం బంగ్లాతో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అసలైన సంగ్రామంలో మాత్రం జూన్ 5న ఐర్లాండ్తో టీమ్ఇండియా తలపడనుంది. దీనిపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇంతకుముందెన్నడూ ఇక్కడ ఆడలేదు. అందుకే వార్మప్ మ్యాచ్ కూడా తమకు ముఖ్యమని.. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు దీన్ని సద్వినియోగం చేసుకుంటామని వ్యాఖ్యానించాడు.