సీఎం ఆదేశాల మేరకే కేసీఆర్‌ను ఆహ్వానించాం: వేణుగోపాల్

తెలంగాణ దశాబ్ధి వేడుకలకు BRS చీఫ్ కేసీఆర్‌ను ఆయన నివాసానికి వెళ్లి ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ బృందం ఆహ్వానించింది. సీఎం రేవంత్ ఆదేశాల మేరకే తెలంగాణ దశాబ్ధి వేడుకలకు కేసీఆర్‌ను ఆహ్వానించామని వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు కేసీఆర్ హాజరవుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్