దేశంలో ఎమర్జెన్సీ చీకటి రోజులను ప్రధాని నరేంద్ర మోదీ మనకు గుర్తుచేశారని, అయితే ఇవాళ దేశంలో నెలకొన్న ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ సంగతేంటని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. పరీక్షల రద్దు, పేపర్ లీక్లు, పరీక్షలపై సీబీఐ విచారణల గురించి దేశ యువత నిలదీస్తోందని అన్నారు. దేశం ఎదుర్కొంటున్న కీలక అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు.