యోగా అనేది ప్రాచీన విద్యనే కాదు.. విజ్ఞానం కూడా అని ప్రధాని మోదీ అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లో యోగా డేలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యోగాకు జమ్మూకశ్మీర్ నిలయం. ప్రపంచంలో యోగా అనేది ఇప్పుడొక కొత్త ట్రెండ్. యోగా గురించి తెలుసుకునేందుకు ఇండియాకు వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది’ అని తెలిపారు.