ఓ దళిత యువతి తన తల్లికి దెయ్యం పట్టిందని.. ఆ భూతాన్ని వదిలించడానికి తాంత్రిక భూతవైద్యుడైన మున్నా మౌల్వీ వద్దకు తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో తాంత్రికుడు యువతిపై మోజు పడి .. ఆపై ఆమెను బెదిరించి అడవికి తీసుకెళ్లి ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో జరిగింది. చివరకి యువతి అతని చెర నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తన దగ్గర రూ.90 వేలు తీసుకోని మోసం చేశాడని ఆరోపించింది.