AP: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 7న B.Ed ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. ప్రశ్నపత్రం లీకేజీపై గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఈడీ పర్స్ పెక్టివ్స్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్నారు. వినుకొండలోని వివేకానంద కళాశాలలో ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.