మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మాణంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, మోహన్ బాబు, ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ను మేకర్స్ రిలీజ్ చేశారు.