కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ను ఢీకొట్టి ఓవర్ టేక్ చేస్తున్న బొలెరో వాహనం కంటైనర్ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.