ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జరుగుతున్న తిరునాళ్లలో అపశ్రుతి చోటుచేసుకుంది. తిరుపతమ్మ తిరునాళ్ల సందర్భంగా పట్టణంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్ ఊడి పడి సాయిమణికంఠ అనే బాలుడు మరణించగా మరొక బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.