టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు కీలక పిలుపు

63చూసినవారు
టీడీపీ శ్రేణులకు అచ్చెన్నాయుడు కీలక పిలుపు
AP: టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి(మే 28) వేడుకలను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్