AP: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్. కార్డు దారులు వెంటనే eKYC చేయించుకోవాలి. లేదంటే రేషన్ కార్డు నుంచి పేరును అధికారుల తొలగించనున్నారు. దీంతో రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు మీరు పొందలేరు. ఇక ఇకేవైసీకి ఈ నెలాఖరు వరకే గడువు ఉంది. ఇప్పటికే ఆయా రేషన్ డిపోల్లో eKYC చేయించుకోవాల్సిన వారి జాబితా రూపొందించి విడుదల చేశారు. కావున వీలైనంత త్వరగా eKYCని పూర్తి చేసుకోవడం మంచిది. చివరి రోజుల్లో సర్వర్ డౌన్ సమస్య తలెత్తే అవకాశం కూడా ఉండనుంది.