ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం
బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిశోర్ రెడ్డి
వైసీపీ గూటికి చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కిశోర్ రెడ్డికి సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కిశోర్ రెడ్డితో పాటు భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక
బీజేపీ నాయకులు వైసీపీలో చేరారు.