రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలకు 167 మంది అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ప్రకటించిన విషయం తెలిసిందే. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నేడు పవన్ పెండింగ్ స్థానాలకు కసరత్తు ప్రారంభించారు. మరో రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది.