డుంబ్రిగుడ మండలంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బొందుగుడకి చెందిన కిండంగి. గాసి, ధన దంపతులకు జన్మించిన బాలుడు తేజ(3) బిస్కట్ తింటుండగా గొంతులో అడ్డుపడింది. దీనితో బాలుడు తల్లిదండ్రులు అరకు ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. దీనితో బాలుడి తల్లిదండ్రులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.