ప్రీమియర్ లీగ్ మూడవ సీజన్ ఆదివారం నుంచి వైజాగ్లోని పియం పాలెం డా. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. మొత్తంగా 19 మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్లు జూలై 13న ముగియనున్నాయి. ఇందులో భాగంగానే శనివారం వైజాగ్లోని ఓ హోటల్లో ఏపీఎల్ ట్రోఫీతో పాటు జెర్సీని లాంఛనంగా శనివారం ప్రారంభించారు.