గాజువాకలో ఎన్నికల ప్రచారం హోరేత్తి పోతుంది. ఎవరికివారు గెలుపుధీమా లో ఇంటింటికి వెళ్లి తమ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం 75వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లాకు వైసీపీ అభ్యర్థి అమర్నాద్ తారసపడడంతో పల్లా పలకరించారు. వెంటనే ఫ్యాన్ అభ్యర్థి అమరనాద్ కారు దిగి ఒకరికి ఒకరు పలకరించుకుని కరచాలానం చేసుకోవడంతో ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది.