మాడుగుల తహసిల్దార్ గా రమాదేవి

66చూసినవారు
మాడుగుల తహసిల్దార్ గా రమాదేవి
మాడుగుల మండల తహసిల్దార్ గా కె రమాదేవి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె విశాఖఆర్టీవో కార్యాలయం నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు తహసిల్దార్ పివి రత్నం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో భూ సెక్షన్కు బదిలీపై వెళ్లారు. తొలుత తహసిల్దార్ రమాదేవి మాడుగుల మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కార్యాలయానికి చేరుకోగా సిబ్బంది డీటీలు వీఆర్వోలు, డీలర్లు ఆమెకు స్వాగతించి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్