మెయిన్ రోడ్డులో ఆక్రమణల తొలగింపు

78చూసినవారు
నర్సీపట్నం మున్సిపాలిటీ మెయిన్ రోడ్లో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం గురువారం చేపట్టారు. మెయిన్ రోడ్ లో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని ఆక్రమణలు తొలగించినట్లు సిఐ రేవతమ్మ తెలిపారు. తొలగింపు కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్