అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

69చూసినవారు
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అల్లూరి జిల్లా అధికారులను కలెక్టర్ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. 99 శాతం మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్టికాహారం అందించాలన్నారు. భోజనంలో 900 కేలరీలు, 23 గ్రాముల ప్రొటీన్లు ఉండేలా ఆరు రోజులకు కావాల్సిన మెనూ చార్ట్ సిద్ధం చేయాలని తెలియజేసారు. అదేవిధంగా చిక్కీలకు వారంలో 3 రోజులు, రాగి జావ 3 రోజులు ఇవ్వాలి.

సంబంధిత పోస్ట్