స్కూల్ సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్

57చూసినవారు
స్కూల్ సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్
ముంచంగిపుట్టు మండలం, కిలగడ కెజిబివి విద్యార్థినులు బుధవారం మరోసారి ఎస్ఓను, అకౌంటెంట్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్, విద్యార్థినులు విలేకరులతో మాట్లాడుతూ..ఎస్ఓ మేడం పిల్లలను చాలా వేదిస్తోందన్నారు. ఆరోగ్యము, భోజనం బాగోలేనప్పుడు తెలియజేస్తే చాలా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా విద్యార్థినిల ఆవేదనను అర్ధం చేసుకుని పరిష్కారం చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్