స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తన్నారు. ఈ మేరకు బుధవారం విశాఖలోని పూర్ణామార్కెట్లో కళాకారులు వీధి నాటకం ప్రదర్శించారు. వ్యర్థాల తొలగింపుపై అవగాహన కల్పించేలా స్కిట్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా విశాఖను పరిశుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు అవకాశం ఉంటుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు.