విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర శుక్రవారం తెలిపారు. జూలై 27వ తేదీ ఉదయం 10. 30గంటలకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని అన్నారు. సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.