విశాఖ: నిత్యాసరాల ధరలపై ఆందోళన

65చూసినవారు
నిత్యాసర ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐద్వా 28వ వార్డు అధ్యక్షురాలు కె. మణి పేర్కొన్నారు. ఈమేరకు విశాఖలో 28వ వార్డులో ఐద్వా మహిళలతో కలిసి సోమవారం ఆందోళన నిర్వహించారు. ధరలు అమాంతం పెరగడంతో దసరా పండగ కూడా సరిగా జరుపుకోలేకపోయామన్నారు. కూరగాయలు ధరలు, విద్యుత్‌ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. తక్షణం పెరిగిన ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్